సింగరేణి కాలరీస్ కంపెనీ నుంచి శుభవార్త అందింది..ఇది కూడా కేసీఆర్ జోరే..! | Telugu News
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి కేంద్ర ప్రభుత్వం తేరుకోలేని షాకిచ్చింది.-కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు స్వర్ణాలతో అదరగొట్టారు.-ఇంటర్ నెట్ లో వైరల్ గా మారిన హైదరాబాద్ క్రీడాకారిణి పివి సింధు ఫోటోషూట్..!!-ఇరు రాష్ట్రాల్లో షాక్..ఏపీ లో కంటే ముందుగా తెలంగాణాలో మొదలెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్!-వికారాబాద్ లో తోపుడు బండిపై భార్య మృతు దేహంతో 60 కి.మీ నడక…!!-ఇప్పుడు రానానే సోలో హీరో అని వార్తలు వస్తున్నాయి.-హీరో శర్వానంద్ సినిమా కి సరికొత్త ప్లాన్ వేస్తున్న దిల్ రాజు కు ఈ సినిమా సెంటిమెంట్ గా మారింది.-ప్రధాన పుణ్యక్షేత్రాల్లో చిరంజీవి కోసం పూజలు చేస్తున్న మెగా అభిమానాలు !-చిరు కోసం క్లైమాక్స్ ఫైట్‌ను డిఫరెంట్‌గా ఉండేలా కనల్ కణ్ణన్‌తో డిజైన్ చేయించారు.-ఇద్దరూ కథానాయికులతో త్రివిక్రమ్,పవన్ కళ్యాణ్ ల కొత్త సినిమా లాంచింగ్ !

సింగరేణి కాలరీస్ కంపెనీ నుంచి శుభవార్త అందింది..ఇది కూడా కేసీఆర్ జోరే..!

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్.. దక్షిణభారత దేశం లోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి కేద్రం ఇది.రెండు దశాబ్దాలుగుగా నానుతోన్న సమస్యకు సింగరేణి బోర్డు సంచలన నిర్ణయంతో తెరదించింది. వారసత్వ ఉద్యోగాల పై రెండుదశాబ్దాల తరువాత నిర్ణయం తీసుకోవడం విశేషం. సింగరేణి బోర్డు డైరెక్టర్స్ శుక్రవారం జరిపిన సమావేశంలో వారసత్వ ఉద్యోగాలకు పచ్చజెండా ఊపారు.

ప్రస్తుతం సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులలో 48 నుంచి 58 సంవత్స రాల మధ్య గలవారు రిటైర్మెంట్ తీసుకున్న పక్షంలో వారి కుటుంబసభ్యులు అయిన కొడుకులు, తమ్ముళ్లు, అల్లుళ్లకు ఉద్యోగం వచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. కానీ వారి వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.బోర్డు ఆఫ్ డైరెక్టర్ ల సమావేశం సంస్థ సీఎండీ ఎన్. శ్రీధర్ అధ్యక్షతన జరిగింది. వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ చట్టం 1981 ని పునరుద్ధించడం ద్వారా న్యాయ పరమైన సమస్యలు తలెత్తవనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీధర్ తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకే తాము వారసత్వం ఉద్యోగాలపై నిర్ణయం తీసుకున్నట్లు అయన తెలిపారు. ఈ నిర్ణయం సంస్థలో పనిచేసే కార్మికులకు శుభవార్తే అయినా మిగిలిన వారి అభిప్రాయాలూ బిన్నం గా ఉండే అవకాశం ఉంది.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *