అంజీర పండుతో ఆరోగ్యం… | Telugu News
గుడ్డు ఉడకాల్సిన సమయం ఎంత?-రేవంత్ కు పంచ్ ఇచ్చిన బాలయ్య-ఏపీలో రద్దు కానున్న ఎంసెట్-నోబెల్ తో రండి 100 కోట్లు పట్టుకెళ్ళండి: బాబు-ఉద్దానం బాధితులపై పూర్తిస్థాయిలో స్పందించిన ముఖ్యమంత్రి-మనకి ప్రాణభిక్ష పెట్టిన సైనికుడు బిచ్చమెత్తుకుంటున్నాడు-సంక్రాంతికి సాంప్రదాయం లోపిస్తోందా??-ఇలాంటి గవర్నర్ మనకు దొరకడం మన ఖర్మ-ఉద్దానం పాపం ఎవరిది?-మద్యం అమ్మకాలపై గళం విప్పిన హర్మన్ సింగ్ సిద్ధూ

అంజీర పండుతో ఆరోగ్యం…

అంజీర పండుతో మెండైన ఆరోగ్యం అందుతుందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. రోజులో రెండు పండ్లు తిన్నా చాలంట అనేక సమస్యలు దూరంగా ఉంటాయని చెబుతున్నారు.

పిల్లలు లేని వారు, కనాలనుకునే వారు అంజరీ పండ్లు రోజు వారి ఆహారం భాగం చేసుకోవాలి. ఇందులో ఉండు మెగ్నీషియం, మాంగనీసు, జింకు ఖనిజాలు సంతాన సాఫల్యతను పెంచడానికి సహకరిస్తాయి.

ఈ కాలంలో అధిక రక్తపోటు సమస్య అందరినీ వేధిస్తోంది. దీనికి సరైన మందు అంజీర పండు. పండైనా లేదా ఎండుదైనా రోజూ తింటే అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. అంజీరలో పొటాషియం, సోడియం పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును తగ్గించడం సహకరిస్తాయి.

అంజీర పండు నిండా పీచు ఉంటుంది. పీచు పదార్థం అధికంగా తినడం వల్ల జీర్ణవ్యవస్థ శుద్ధి పడుతుంది. అలాగే దాని పనితీరు కూడా మెరుగుపడుతుంది.

చిన్నపిల్లల్లో చాలా మందికి మలబద్ధకం సమస్య ఉంటుంది. కనుక వారికి అంజీర రెండు పూటలా తినిపిస్తే ఆ సమస్య తొలగిపోతుంది. అలాగే చిన్నప్పట్నించి కూడా అంజీర పెట్టడం వల్ల వారికి రక్త హీనత సమస్య రాకుండా కూడా కాపాడుకోవచ్చు.

మహిళల్లో కూడా రక్త హీనత సమస్య అధికంగా ఉంటుంది. అంజీర పండును లేదా ఎండు అంజీరను తినడం అలవాటు చేసుకుంటే హిమోగ్లోబిన్ స్థాయులు పెరుగుతాయి.

అంజీర పండ్లు ఎన్ని తిన్నా కొలెస్ట్రాల్ చేరదు. కనుక బరువు తగ్గాలనుకునేవారికి ఈ పండ్లు మంచి ఛాయిస్. భోజనానికి ముందు ఓ కప్పుడు అంజీర ముక్కల్ని తినడం వల్ల పొట్టనిండినట్టుగా అనిపిస్తుంది. అనంతరం భోజనం తక్కువ తింటారు. ఇలా చాలా హెల్తీ పద్ధతిలో బరువు తగ్గొచ్చు. గుండెకు కూడా చాలా మేలు చేస్తాయి అంజీర పండ్లు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts