మహిళలూ రొమ్ము కాన్సర్ ని మీకు మీరే పరీక్షించుకోండి
స్త్రీ తన రొమ్మును తాను స్వయంగా నెలకొకసారి పరీక్షించుకుంటే రొమ్ము క్యాన్సర్ని చాలా ముందుగానే గుర్తించవచ్చు
భారతదేశంలో ఆడవారికి వచ్చే క్యాన్సర్లలో రొమ్ముక్యాన్సర్ మరియు గర్భసంచి క్యాన్సర్లు ప్రదానమైనవి.గ్రామాలలో గర్భసంచి క్యాన్సర్లు ఎక్కువ. పట్టణాలలో రొమ్ము క్యాన్సర్లు ఎక్కువ.
రొమ్మును రెండు విధాలుగా పరీక్షించుకోవచ్చు.
1.అద్దం ముందు పరీక్షించుకోవడం
2.చేత్తో రొమ్మును తవిడి పరీక్షించుకోవడం
——————————————————————-
1.అద్దం ముందు పరీక్షించుకోవడం–
.రొమ్ములు అద్దంలొ కనిపించే లాగా అద్దం ముందు నిలబడాలి
.రొమ్ముల ఆకారంలో తేడా వుందేమో చూసుకోవాలి
*చనుమొనలు ఒకే స్తాయిలొ వున్నాయా లేదా అన్నది చూసుకోవాలి .పైకి,కిందికి జారివుంటే గుర్తించాలి
2.చేత్తో రొమ్మును తవిడి పరీక్షించుకోవడం
నెల వచ్చిన తరువాత రొమ్మును పరీక్షించుకోవాలి.కుడి రొమ్మును పరీక్షీంచుకోవాలంటేఎడమ చేత్తో పరీక్షించుకోవాలి.ఆసందర్భంవాలొ కుడి చేయి నెత్తి మీద వుండాలి.ఎడమరొమ్మును కుడిచేత్తొ పరీక్షించుకోవాలి
ఇలా పరిశీలించుకున్నపుడు దొరికిన గడ్డలు,కఱితలసను వీలయినంత త్వరగా డాక్టర్ గారికి చూపిస్తే ముక్కాలు భాగం రొమ్ముక్యాన్సర్లని చాలాముందుగా గుర్తించవచ్చు .
ఇలా రొమ్మును 20 సంవత్సరావాల వయస్సు నుంచి 80 సంవత్సరాల వయస్సు వరకు ప్పతి నెలాపరీక్ష చేసుకుంటే దరిదాపుగా రొమ్ము క్యాన్సర్ని ముందుగా గుర్తించగలం
Leave a Reply