జయలలిత గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు… | Telugu News
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక ఇవ్వనున్న చంద్రబాబు..!!-కరుణను తట్టుకోవాలంటే మోదీ సాయం తప్పదు...-చలికాలంలో ఇవి తింటే మంచిది...-ముంబాయి టెస్టులో ఇరు జట్లకు తొలిసారిగా....-అన్నగారి పేరిట అవార్డు ఇవ్వనున్న తెలంగాణ రాష్ట్రం...-కేజీ నుంచి పీజీ వరకూ ఒకేచోట ఉండేలా తెలంగాణకు రానున్న విద్యాసంస్థ...-తెలంగాణ సీఎం కెసిఆర్ మీద ఫైర్ అయినా టీడీపీ ఫైర్ బ్రాండ్...-ఈ బీచ్ లో బాగా ఎంజాయ్ చేయొచ్చు అంటా....-అమ్మ రాక కోసం రాత్రి వరకు చూసిన గుడి....-అల్లరోడు ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్ లైట్ తీసుకోమంది అంటా...

జయలలిత గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు…

 * జయలలిత కర్ణాటకలోని తమిళ అయ్యంగార్ కుటుంబంలో జన్మించారు. నాటి మైసూరు సంస్థానంలోని మాండ్యాలో ఆమె పుట్టారు.

* జయలలిత అసలు పేరు కోమలవల్లి. అది అమ్మమ్మ పేరు. బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం పాఠశాలలో చేర్పించినప్పుడు జయలలిత అని పేరు పెట్టారు.

* జయలలిత తమిళంతోపాటు తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు.

* తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 140 సినిమాల్లో ఆమె నటించారు. ఇజ్జత్ అనే ఒక్క హింది సినిమాలో నటించారు.

* జయ తెలుగులో 28 సినిమాల్లో నటించారు. తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం మనుషులు మమతలు.

* జయలలిత 15వ ఏటే సినిమాల్లోకి అడుగుపెట్టారు. మెట్రిక్యులేషన్ స్టేట్ టాపర్ అయిన ఆమె తొలి సినిమాలోనే విడో పాత్రను పోషించారు.

* జయలలిత 1981లో రాజకీయాల్లోకి వచ్చారు. 1983 నుంచి 1989 వరకు రాజ్యసభ సభ్యురాలుగా పనిచేశారు.

* 1972లోనే తమిళనాడు ప్రభుత్వం జయలలితను కళైమామణి పురస్కారంతో సత్కరించింది.

* అత్యంత పిన్న వయసులోనే తమిళనాడు సీఎంగా ఎన్నికైన వ్యక్తిగా ఆమె రికార్డు నెలకొల్పారు. 43 ఏళ్లకే ఆమె ముఖ్యమంత్రి అయ్యారు.

* అక్రమాస్తుల కేసు కారణంగా ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన తొలి వ్యక్తి జయలలిత.

* ఎంజీఆర్ చనిపోయాక ఆయన వారసురాల్ని తానేనని జయ ప్రకటించుకున్నారు.


* జయలలితకు శశికళతో చాలా సాన్నిహిత్యం ఉంది. ఒకానొక సమయంలో వీరిద్దరి మధ్య సంబంధాలు సన్నగిల్లాయి. దీంతో శశికళ జయకు స్లో పాయిజన్ ఇచ్చిందని, అప్పటి నుంచి ఆమె ఆరోగ్యం క్షీణిస్తోందని తెహల్కా కథనం.

* జయలలితకు జయకుమార్ అనే సోదరుడు ఉండేవాడు.. 1995లో ఆయన చనిపోయాడు. జయకు అనారోగ్యంగా ఉన్న సమయంలో ఆయన కూతురు ప్రియ జయను చూసేందుకు అపోలోకు వచ్చింది. కానీ ఆమెను లోపలికి అనుమతించలేదు.

* జయలలిత తన బంధువుల్ని ఎవర్నీ తన నివాసమైన పోయస్ గార్డెన్లోకి రానివ్వలేదు. తన మేన కోడలు చాలాసార్లు వచ్చి ఆమెను కలిసేందుకు ప్రయత్నించినా.. జయ అందుకు అంగీకరించలేదు.


* ఆమె శోభన్ బాబుతో ప్రేమాయణం నడిపిందనే వార్తలున్నాయి.

* జయలలిత భారీ ఖర్చుతో తన దత్త పుత్రుడి పెళ్లి చేశారు. ఆ పెళ్లికి రూ.100 కోట్లు ఖర్చయ్యాని వార్తలొచ్చాయి.

* జయ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు వ్యక్తి మర్రి చెన్నారెడ్డి తమిళనాడు గవర్నర్‌గా వ్యవహరించారు. ఆయనతో జయకు సరిగా పడేది కాదు. చెన్నారెడ్డి కూడా జయతో పోరాడేందుకు ఏ మాత్రం వెనక్కి తగ్గేవాడు కాదు. ప్రస్తుత తమిళనాడు ఇంఛార్జ్ గవర్నర్ విద్యాసాగరరావు, ఆయన కంటే ముందు గవర్నర్‌గా పని చేసిన రోశయ్య.. ఈ ముగ్గురూ జయ హయాంలో తమిళనాడు గవర్నర్లుగా పని చేశారు.

* తమిళ ప్రజలు, జయలలితను అమ్మ, పురట్చి తలైవి అని పిలుస్తుంటారు. పురట్చి తలైవి అంటే విప్లవ నాయకురాలు అని అర్థం.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts