అమ్మ ప్రాణంపై ఈ పుకార్లేంటి?? | Telugu News
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక ఇవ్వనున్న చంద్రబాబు..!!-కరుణను తట్టుకోవాలంటే మోదీ సాయం తప్పదు...-చలికాలంలో ఇవి తింటే మంచిది...-ముంబాయి టెస్టులో ఇరు జట్లకు తొలిసారిగా....-అన్నగారి పేరిట అవార్డు ఇవ్వనున్న తెలంగాణ రాష్ట్రం...-కేజీ నుంచి పీజీ వరకూ ఒకేచోట ఉండేలా తెలంగాణకు రానున్న విద్యాసంస్థ...-తెలంగాణ సీఎం కెసిఆర్ మీద ఫైర్ అయినా టీడీపీ ఫైర్ బ్రాండ్...-ఈ బీచ్ లో బాగా ఎంజాయ్ చేయొచ్చు అంటా....-అమ్మ రాక కోసం రాత్రి వరకు చూసిన గుడి....-అల్లరోడు ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్ లైట్ తీసుకోమంది అంటా...

అమ్మ ప్రాణంపై ఈ పుకార్లేంటి??

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కన్నుమూసినట్టు పలు చానెళ్లు వార్తలు ప్రసారం చేశాయి. అయితే అమ్మ చనిపోయందంటూ తప్పుడు వార్తలు ప్రసారం చేశారంటూ ఓ చానల్‌పై అన్నాడీఎంకే కార్యకర్తలు దాడి చేశారు. ముందుగా తమిళ న్యూస్ చానెళ్లు ఈ విషయాన్ని ప్రసారం చేయడం విశేషం. వీటిలో జయలలిత సొంత చానెల్ జయా టీవీ కూడా ఉంది. జయలలిత ఆరోగ్యంపై అపోలో వైద్యులు చేస్తున్న ప్రకటనలు అన్నాడీఎంకే కార్యకర్తల విశ్వాసానికి ఊతమిస్తున్నాయి. మరో పక్క ఆసుపత్రికి వెళ్లి వస్తున్న ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఏమీ మాట్లాడకపోవడం అనుమానాలను తావిస్తోంది.


ఒక పక్క జయలలిత ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నట్టు చెప్తున్నారు అపోలో బృందం. ఇప్పటికే లండన్ నుంచి వచ్చిన వైద్యులు కూడా ఆమెకు చికిత్స చెయ్యలేక చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే..అమ్మకు వచ్చిన గుండెపోటుపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జయకు నిజంగానే హార్ట్ అటాక్ వచ్చిందా? లేక ఇంకేదైనా ప్రాబ్లమా? అన్నది తెలియాల్సి ఉంది. కాగా చాలా మంది మాత్రం ఆమె నిన్న సాయంకాలమే మరణించింది అని, అటు డాక్టర్స్, ఇటు మంత్రులు ఆ ప్రకటన చెయ్యకుండా ప్రజలను మభ్య పెడుతున్నారని ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఎవరి మాట నమ్మాలో తెలియక, అమ్మకు జరగరానిది ఏదైనా జరిగితే ఊరుకోం అని ఇప్పటికే చెన్నై లోని అపోలో ఆస్పత్రి ముందు జయ అభిమానులు భారీగా గుమికూడి ఉన్నారు. ఐసీయూలో ప్రస్తుతం అమ్మకు మెరుగైన వైద్యం అందించిన తరువాత హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన వైద్యులు, ఆమె పరిస్థితి ‘క్రిటికల్’గానే ఉందని చెప్పడం గమన్హారం. మరో వైపు అసలు అమ్మ ఎలా ఉందో ప్రజలకు తెలియాలని, ఆమె ఆరోగ్యంపై ప్రధాని మోదీ కూడా జోక్యం చేసుకోవాలని చెప్పింది అన్నా డీఏంకే బహిష్కృత ఎంపీ శశికళ.అక్కడ ఏం జరిగింది అనే విషయం పక్కన పెడితే..ఇప్పటికే జయ మరణించింది అని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వెల్లువడటంపై అమ్మ అభిమానులు తీవ్ర మనస్థాపానికి అవుతున్నారు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts